సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మంచి ఊపు మీద ఉన్నారు. సుకుమార్ సినిమా అనంతరం మహేష్ బాబు బోయపాటి శ్రీను దర్శకత్వం లో నటిస్తారు. ఈ చిత్రానికి బూరుగుపల్లి శివ రామకృష్ణ మరియు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మహేష్ బాబు కి సుమారు 15 కోట్ల రూపాయల పారితోషికం అందించినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రానికి బోయపాటి మంచి కథను సిద్ధం చేస్తూ ఉండగా, మిగతా వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి అని సమాచారం. ఈ రేటు తో మహేష్ బాబు తెలుగు సినిమా పరిశ్రమ లో కెల్లా అత్యంత భారీ పారితోషికం తీసుకునే తార గా మారిపోయారు.