కంగారు పడకండి. ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ‘బిజినెస్ మేన్’ చిత్రం ఎంత హిట్ అయిందో ఆ చిత్రంలో సారోస్త్రార రొస్తరా పాట కూడా అంతే హిట్ అయింది. ఆ పాట పాడింది మరెవరో కాదు సుచిత్ర. మొదట్లో ఐటీ ప్రొఫెషనల్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆమె తరువాత రేడియో జాకీగా కూడా పని చేసారు తరువాత కొన్నాళ్ళకు సింగర్ అవతారం ఎత్తారు. ఆమె తెలుగు మరియు తమిళంలో పలు హిట్ పాటలు పాడారు. ఆమె పోకిరి సినిమాలో పాడిన ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే’ పాట ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అలాగే ‘పిల్ల నా వల్ల కాదు’ ‘ఎక్స్క్యుజ్ మీ మిస్టర్ మల్లన్న’ పాటలు కూడా బాగా హిట్ అయ్యాయి. హైదరబాదులో పుట్టిన ఈమె స్కూల్ జీవితం కూడా ఇక్కడే గడిపింది. తరువాత చెన్నైకి మారిపోయారు. ఈ గొంతు దేవుడు తనకిచ్చిన వరం అంటున్నారు సుచిత్ర.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- మీకు తెలుసా? : కమల్ తో సౌందర్య చేయాల్సిన మొదటి సినిమా ఇదని
- లెటర్బాక్స్డ్ టాప్ 100 లో మహేష్ బాబు డబుల్ బొనాంజా
- ఈ ఓటిటి ప్లాట్ ఫామ్ లో “ఓ మై గాడ్ 2” తెలుగు
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘ఫ్యామిలీ స్టార్’
- బజ్ : మ్యూజికల్ అప్ డేట్ కి రెడీ అవుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ ?
- SSMB 29 : అందుకే మహేష్, రాజమౌళి హఠాత్తుగా తిరిగివచ్చారా ?
- ‘అఖండ – 2’ : ఆ రోజున అనౌన్స్ మెంట్ రానుందా ?