గౌరవం చిత్రాన్ని నిర్మించబోతున్న ప్రకాష్ రాజ్

గౌరవం చిత్రాన్ని నిర్మించబోతున్న ప్రకాష్ రాజ్

Published on Apr 22, 2012 12:04 PM IST

పరిచయం అక్కర్లేని విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. సల్మాన్ ఖాన్ హిందీలో చేస్తున్న దబంగ్ 2 షూటింగ్లో పాల్గొన్న ప్రకాష్ రాజ్, ఇటీవలే పూరి జగన్నాధ్ డైరెక్షన్లో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘దేవుడు చేసిన మనుషులు’ షూటింగ్ కూడా పాల్గొన్నాడు. బ్యాంకాక్లో షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రంలో తన పాత్ర వరకు చిత్రీకరణ పూర్తయింది. బ్యాంకాక్ నుండి చెన్నై చేరుకున్న ప్రకాష్ రాజ్ తిరిగి ‘గౌరవం’ షూటింగ్లో పాల్గొననున్నాడు. రాధామోహన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రకాష్ రాజ్ నిర్మాత. ఆయనకు నిర్మాతగా ఇది నాలుగవ చిత్రం. అల్లు శిరీష్ హీరోగా పరిచయం చేస్తూ రాబోతున్న ఈ చిత్రంలో తమన్నా హీరొయిన్ గా మతిన్చానున్నట్లు తమిళ సినీ వర్గాల సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు