అనీష్ కురివిల్లా డైరెక్షన్లో శర్వానంద్?

అనీష్ కురివిల్లా డైరెక్షన్లో శర్వానంద్?

Published on Apr 22, 2012 9:52 PM IST

కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ‘అవకాయ్ బిర్యాని’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు అనీష్ కురివిల్లా. చాలా రోజులు గ్యాప్ తీసుకున్న అనీష్ త్వరలో మరో సినిమా తీయబోతున్నాడు. అయితే ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటించబోతున్నట్లు సమాచారం. సర్వా ఆర్ట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కనున్నట్లు సమాచారం. శర్వానంద్ ఇటీవలే నువ్వా నేనా అనే సినిమాలో నటించాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్లో ఉన్న ఈ సినిమా కోసం దర్శకుడు అనీష్ కొత్త వారిని ఎంపిక చేసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు