రేయ్ చిత్ర షూటింగ్లో మళ్లీ గాయపడిన శ్రద్ధా దాస్

రేయ్ చిత్ర షూటింగ్లో మళ్లీ గాయపడిన శ్రద్ధా దాస్

Published on Dec 25, 2011 5:22 PM IST

వైవిఎస్ చౌదరి డైరెక్షన్లో సాయి ధర్మ తేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రేయ్’. ఇటీవలే ఈ షూటింగ్లో జరిగిన ప్రమాదంలో శ్రద్ధా దాస్ గాయపడిన సంగతి తెలిసిందే. కంటికి జరిగిన ప్రమాదంలో 4 రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఆ గాయం నుండి కోలుకుని నిన్న మళ్లీ షూటింగ్లో పాల్గొన్న శ్రద్ధా దాస్ మళ్లీ ప్రమాదానికి గురైంది. ఒక పెద్ద లైట్ కట్టర్ తన తలపై పడటంతో ఈ ప్రమాదం జరిగింది. మెడికల్ టీం వెంటనే స్పందించటంతో వెంటనే కోలుకుని మళ్లీ షూటింగ్లో పాల్గొన్నారు. ఈ తతంగం అంతా బ్యాంకాక్ లో జరగడం విశేషం. మెగా స్టార్ చిరంజీవి గారి మేనల్లుడు హీరోగా నటిస్తుండగా సుబ్రా అయ్యప్ప హీరోయిన్ గా నటిస్తుంది. శ్రద్ధా దాస్ రెండో హీరోయిన్ గా నటిస్తుంది. రేయ్ చిత్రానికి నిర్మాత మరియు దర్శకుడు వైవిఎస్ చౌదరి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు