వైవిఎస్ చౌదరి డైరెక్షన్లో సాయి ధర్మ తేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రేయ్’. ఇటీవలే ఈ షూటింగ్లో జరిగిన ప్రమాదంలో శ్రద్ధా దాస్ గాయపడిన సంగతి తెలిసిందే. కంటికి జరిగిన ప్రమాదంలో 4 రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఆ గాయం నుండి కోలుకుని నిన్న మళ్లీ షూటింగ్లో పాల్గొన్న శ్రద్ధా దాస్ మళ్లీ ప్రమాదానికి గురైంది. ఒక పెద్ద లైట్ కట్టర్ తన తలపై పడటంతో ఈ ప్రమాదం జరిగింది. మెడికల్ టీం వెంటనే స్పందించటంతో వెంటనే కోలుకుని మళ్లీ షూటింగ్లో పాల్గొన్నారు. ఈ తతంగం అంతా బ్యాంకాక్ లో జరగడం విశేషం. మెగా స్టార్ చిరంజీవి గారి మేనల్లుడు హీరోగా నటిస్తుండగా సుబ్రా అయ్యప్ప హీరోయిన్ గా నటిస్తుంది. శ్రద్ధా దాస్ రెండో హీరోయిన్ గా నటిస్తుంది. రేయ్ చిత్రానికి నిర్మాత మరియు దర్శకుడు వైవిఎస్ చౌదరి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : రత్నం – సిల్లీ యాక్షన్ ఎంటర్ టైనర్!
- మీకు తెలుసా? : కమల్ తో సౌందర్య చేయాల్సిన మొదటి సినిమా ఇదని
- లెటర్బాక్స్డ్ టాప్ 100 లో మహేష్ బాబు డబుల్ బొనాంజా
- ఈ ఓటిటి ప్లాట్ ఫామ్ లో “ఓ మై గాడ్ 2” తెలుగు
- ‘అఖండ – 2’ : ఆ రోజున అనౌన్స్ మెంట్ రానుందా ?
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘ఫ్యామిలీ స్టార్’
- బజ్ : మ్యూజికల్ అప్ డేట్ కి రెడీ అవుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ ?