వైవిఎస్ చౌదరి డైరెక్షన్లో సాయి ధర్మ తేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రేయ్’. ఇటీవలే ఈ షూటింగ్లో జరిగిన ప్రమాదంలో శ్రద్ధా దాస్ గాయపడిన సంగతి తెలిసిందే. కంటికి జరిగిన ప్రమాదంలో 4 రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఆ గాయం నుండి కోలుకుని నిన్న మళ్లీ షూటింగ్లో పాల్గొన్న శ్రద్ధా దాస్ మళ్లీ ప్రమాదానికి గురైంది. ఒక పెద్ద లైట్ కట్టర్ తన తలపై పడటంతో ఈ ప్రమాదం జరిగింది. మెడికల్ టీం వెంటనే స్పందించటంతో వెంటనే కోలుకుని మళ్లీ షూటింగ్లో పాల్గొన్నారు. ఈ తతంగం అంతా బ్యాంకాక్ లో జరగడం విశేషం. మెగా స్టార్ చిరంజీవి గారి మేనల్లుడు హీరోగా నటిస్తుండగా సుబ్రా అయ్యప్ప హీరోయిన్ గా నటిస్తుంది. శ్రద్ధా దాస్ రెండో హీరోయిన్ గా నటిస్తుంది. రేయ్ చిత్రానికి నిర్మాత మరియు దర్శకుడు వైవిఎస్ చౌదరి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: భజే వాయు వేగం – ఇంప్రెస్ చేసే యాక్షన్ థ్రిల్లర్
- సమీక్ష: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ – ఆకట్టుకోలేకపోయిన యాక్షన్ డ్రామా
- సమీక్ష : ‘గం గం గణేశా’ – మెప్పించలేక పోయిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ !
- సమీక్ష: “మిస్టర్ & మిస్ మాహి” – బోరింగ్ స్పోర్ట్స్ డ్రామా
- మంచి ఫిజిక్ తో “స్వయంభు” నుంచి నిఖిల్ బర్త్ డే స్పెషల్ పోస్టర్
- “గేమ్ ఛేంజర్” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!
- మహేష్ కోసం ఆ బ్యూటీని తీసుకొస్తారా..?
- పుష్ప-2 రూల్.. ఇంకో 75 రోజులే!