విరామం తరువాత “గబ్బర్ సింగ్” బృందంలో చేరిన శృతి

విరామం తరువాత “గబ్బర్ సింగ్” బృందంలో చేరిన శృతి

Published on Apr 23, 2012 11:30 PM IST

కొంత కాలం విరామం తరువాత శృతి హాసన్ “గబ్బర్ సింగ్” చిత్రీకరణలో మరో రెండు రోజుల్లో పాల్గొననుంది. ఈ భామ వారం రోజుల క్రితమే పాచ్ వర్క్ మరియు ఒక పాటను పూర్తి చేసింది. కాస్త విరామం తీసుకొని తన్న స్నేహితులు మరియు కుటుంబంతో గడిపారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ మరియు మలైకా అరోరాల మీద పాటను మరియు పవన్ కళ్యాణ్ మీద టైటిల్ సాంగ్ ను చిత్రీకరించారు. ఈ చిత్ర బృందం కొద్ది రోజుల్లో పవన్ మరియు శృతి మీద పాట చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లనున్నారు. ఈ చిత్రం మే రెండవ వారంలో విడుదల కానుంది. ఈ చిత్రం అనుకున్న తేదిలో విడుదల చెయ్యటానికి ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గణేష్ బాబు నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు