మోడీ సంకల్పం కోసం నరసింహస్వామిని తీసుకొస్తున్న పురాణపండ శ్రీనివాస్

మోడీ సంకల్పం కోసం నరసింహస్వామిని తీసుకొస్తున్న పురాణపండ శ్రీనివాస్

Published on Apr 7, 2020 4:00 PM IST

Narendra Modi, G. Kishan Reddy Book

Puranapanda Srinivas

హైదరాబాద్ : ఏప్రిల్: 7

కొవిడ్‌ సృష్టించగల మానవ మహా విషాదం తాలూకు భయంతో భారత్ సహా పలు దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించి కరోనా వ్యాప్తి నిరోధానికి తాపత్రయపడుతున్న ఈ విపత్కర పరిస్థితిలో … ఈ భయంకర వ్యాధి ఇబ్బండి నుండి రక్షించమని కోరుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పానికి మద్దతుగా … కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి జి. కిషన్ రెడ్డి సమర్పణలో తెలుగు రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ ప్రముఖులు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సుధీష్ రాంభట్ల , ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావు ఒక అద్భుతమైన దైవీయ గ్రంధాన్ని ప్రచురించి ఢిల్లీ సహా తెలుగు రాష్ట్రాలలో లక్షల ప్రతులుఉచితంగా పంచబోతున్నారు.

ఆది శంకరాచార్య ప్రణీతమైన మహాశక్తి సంపన్నస్తోత్రమ్ ” శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రమ్ ‘ ప్రచురణ మహత్కార్యాన్ని ప్రముఖ రచయిత , జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం సంస్థాపకులు పురాణపండ శ్రీనివాస్ కి అప్పగించారు. పురాణపండ శ్రీనివాస్ అపురూప మహాగ్రంధం ‘ నన్నేలు నాస్వామి ‘ ని ఇటీవల భారత హోమ్ శాఖామంత్రి అమిత్ షా ఆవిష్కరించి శ్రీనివాస్ పై ప్రశంసలు వర్షించిన విషయం తెలిసిందే.

ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ‘ జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం ‘ సమర్పణలో పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనకర్తగా వెలువరించిన ఎన్నో సమ్మోహన గ్రంధాలకు భారీ డిమాండ్ వున్న విషయం భక్త పాఠకులకూ, రసజ్ఞులకూ తెలిసిందే. భారత దేశంలో ప్రముఖమైన పదహారు నృసింహ క్షేత్రాల మూలవిరాట్టుల మనోహర మంగళ దృశ్యాలతో , అందమైన వ్యాఖ్యాన వైఖరితో పరమ శోభాయమానంగా ఈ గ్రంధాన్ని పురాణపండ శ్రీనివాస్ తీర్చిదిద్దుతున్నారు.

శంకర జయంతి సందర్భంగా ఈ నెల 28 వ తేదీన విడుదల చేస్తున్న ఈ పుస్తకాన్ని భారతీయ జనతాపార్టీ కార్యకర్తల ద్వారా పంపిణీ చేస్తారు.

 

 

Click here for Video

సంబంధిత సమాచారం

తాజా వార్తలు