బిజీగా మారిపోయిన తాప్సీ

బిజీగా మారిపోయిన తాప్సీ

Published on Dec 15, 2011 1:55 AM IST

‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో తెలుగు చలనచిత్ర సీమకు పరిచయమైన తాప్సీ తెలుగు, తమిళం మరియు హిందీ మూడు భాషల్లోనూ నటిస్తుంది. ఈ భామ తెలుగులో ఇటీవలే గోపీచంద్ సరసన ‘మొగుడు’ చిత్రంలో నటించిన విడుదలై నిరాశ పరిశించింది. రవితేజ తో ‘వీర’ చిత్రంలో నటించింది. వీరి జంట మరోసారి తెరపై కనిపించనుంది. శివ దర్శకత్వంలో బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్న చిత్రంలో రవితేజకి జంటగా తాప్సీ నటిస్తుంది. తమిళంలో ధనుష్ తో ‘ఆడుకలాం’ చిత్రంలో నటించి తమిళ కుర్రకారును గిలిగింతలు పెట్టించింది. ఆ తరువాత జీవాతో ‘వందాన్ వెండ్రాన్’ లోనూ నటించింది. ప్రస్తుతం ఆది (వైశాలి ఫేం) తో ఒక సినిమాలో చేయనుంది. ఇవే కాక ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో నటించే అవకాశం కొట్టేసింది. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో
‘చష్మే బద్ధూర్’ అనే చిత్రం నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు