మిస్టర్ మజ్ను ఓ క్లారిటీ ఇచ్చాడు !

మిస్టర్ మజ్ను ఓ క్లారిటీ ఇచ్చాడు !

Published on Nov 7, 2018 3:30 PM IST

యువ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న మూడవ చిత్రం ‘మిస్టర్ మజ్ను’ చిత్రం యొక్క షూటింగ్ తుది దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో ఈ చిత్రం యొక్క షూటింగ్ పూర్తికానుంది. ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో అఖిల్ ప్లే బాయ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రం విడుదలై ఫై ఒక క్లారిటీ వచ్చింది. ఈచిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి లో విడుదల చేయనున్నారని కొద్దీ సేపటి క్రితం అధికారకంగా ప్రకటించారు. అయితే ఈచిత్రం సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం లేదని తెలుస్తుంది. ఇప్పటికే ‘ వినయ విధేయ రామ , ఎఫ్ 2, ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రాలు సంక్రాంతి విడుదలను కన్ఫర్మ్ చేసుకున్నాయి. మరి ఈ చిత్రాలతో పోటీ పడి మిస్టర్ మజ్ను ను విడుదల చేసే సాహసం చేయలేరు కనుక ఈ చిత్రం జనవరి చివరి వారంలో ప్రేక్షకులముందుకు వచ్చే అవకాశాలు వున్నాయి. త్వరలోనే ఈ చిత్రం యొక్క విడుదలతేది ఫై క్లారిటీ రానుంది.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్విసీసీ పతాకం ఫై బి వి ఎస్ ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక తన కెరీర్ లో ఇప్పటివరకు సాలిడ్ హిట్ లేని అఖిల్ ఈ చిత్రంతో ఆ లోటును తీర్చుకోవాలని భావిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు