మై’త్రీ’ ఆ చిత్రంతో బౌన్స్ బ్యాక్ అవుతారా ?

మై’త్రీ’ ఆ చిత్రంతో బౌన్స్ బ్యాక్ అవుతారా ?

Published on Nov 4, 2018 4:30 PM IST

వరుస బ్లాక్ బ్లాస్టర్ సినిమాలను నిర్మించి ఇండస్ట్రీ లో అనతికాలంలోనే నంబర్ వన్ చిత్ర నిర్మాణ సంస్థ గా పేరు తెచ్చుకుంది మైత్రీ మూవీ మేకర్స్. అయితే ఈ సంస్థ తాజాగా నిర్మించిన చిత్రం ‘సవ్యసాచి’ ఇటీవల విడుదలై మిక్సడ్ రివ్యూస్ ను తెచ్చుకోవడంతో ఈ ప్రభావం కలెక్షన్స్ ఫై పడింది. మొదటి రోజు మంచి కలెక్షన్స్ ను రాబట్టిన ఈ చిత్రం రెండు రోజు కలెక్షన్స్ చాలా చోట్ల డ్రాప్ అయినట్లు సమాచారం. దాంతో వరుస విజయాలతో దూసుకుపోతున్నమైత్రీ స్పీడ్ కు అడ్డుకట్ట వేసింది ఈ చిత్రం.

ఇక మరో రెండు వారాల తరువాత మైత్రీ నిర్మించిన మరో చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. అదే శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ నటించిన ‘అమర్ అక్బర్ ఆంటొని ‘. ఈ చిత్ర హీరో , దర్శకుడు ఇటీవల వరస పరాజయాలతో కొనసాగడం కలవరపెడుతున్న ఇటీవల విడుదలైనా ఈచిత్ర టీజర్ చిత్రం ఫై అంచనాలను పెంచింది. మరి నవంబర్ 16న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం విజయం సాధించడం వారిద్దరి తో పాటు మైత్రీ కి కూడా చాలా అవసరం. మరి ఈ సినిమా తోనైనా సాలిడ్ హిట్ కొట్టి మై’త్రీ’ బౌన్స్ బ్యాక్ అవుతారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు