హీరో రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనెర్ ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ చిత్రం జూలై 18న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. గుంటూరులో నిన్న జరిగిన ‘ఇస్మార్ట్ ఈవెంట్’లో హీరోయిన్స్ నభా నటేష్ చాలా గ్లామర్ గా కనిపిస్తూ.. వచ్చిన ప్రేక్షకులను బాగా అలరించింది. మొత్తానికి నభా నటేష్ రెండు రాష్ట్రాల తెలుగు కుర్రాళ్ళను బాగా ఎట్రాక్ట్ చేస్తోంది. పైగా తెలుగులో మాట్లాడటం.. యాక్టివ్ గా ప్రమోషన్స్ లో కనపడటం నభాకి అడ్వాంటేజ్ గా మారాయి.
ఇక మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యంలో విడుదలైన పాటలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రామ్ సరికొత్త లుక్ లో కనపింబోతున్నారు. రాజ్ తోట ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాల పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.