
‘కింగ్’ నాగార్జున నటించిన భక్తిరస చిత్రం ‘శిరిడి సాయి’ చిత్రం విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాత ఎ. మహేష్ రెడ్డి తన ఆనందాన్ని నిన్న మీడియాతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ ‘ షిర్డీ సాయి ఆశీర్వాదంతో తీసిన ‘శిరిడి సాయి’ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. చాలా కాలంగా సినిమాలు చూడని వారు కూడా ఈ సినిమాని చూడటం చాలా ఆనందంగా ఉంది. స్వతహాగా వ్యాపారవేత్త అయిన నేను బాబా మీద భక్తితో ఈ చిత్రాన్ని నిర్మించాను. ఆయన అనుగ్రహం ఇలానే ఉంటే ఇంకా సినిమాలు చేయొచ్చు. శిరిడి సాయి సినిమా చూసిన తర్వాత చాలా మంది నాగార్జున గారితో రామకృష్ణ పరమహంస మీద సినిమా తీయొచ్చుగా అని అడుగుతున్నారు. ఆ బాబా దయ నా మీద ఉంటే ఖచ్చితంగా తీస్తాను’ అని ఆయన అన్నారు. ఈ సినిమాకి కథ సిద్దమైతే నాగార్జున గారు ఈ సినిమా చేస్తారా? లేదా? మరియు ఈ సినిమా అసలు కార్య రూపం దాలుస్తుందా లేదా అనే దాని కోసం మరి కొంత కాలం వేచి చూడక తప్పదు.
రామకృష్ణ పరమహంసగా నాగార్జున?
రామకృష్ణ పరమహంసగా నాగార్జున?
Published on Sep 26, 2012 10:46 AM IST
సంబంధిత సమాచారం
- మహేష్, ప్రభాస్ ఫెయిల్.. బన్నీ అయినా చేస్తాడా..?
- ‘టాక్సిక్’ లో వల్గారిటీ.. యశ్ ఇచ్చాడు క్లారిటీ..!
- 51 ఇయర్స్ ఆఫ్ తలైవా.. ‘ధర్మన్’ సెట్స్ లో గ్రాండ్ సెలెబ్రేషన్స్..!
- ‘లెనిన్’ సక్సెస్.. అఖిల్ సైలెంట్.. ఎందుకో..?
- సూర్యతో ఎప్పటికైనా సినిమా చేస్తా – త్రివిక్రమ్
- ఘనంగా శ్రీహరి జయంతి వేడుకలు..!
- ‘ఆస్మాన్’తో మేఘాంశ్ సక్సెస్ అందుకోవాలి – శాంతి శ్రీహరి
- 3 నెలల్లో 2 బ్లాక్ బస్టర్స్.. సూర్య సత్తా ఇది..!
- మరోసారి సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ సినిమా!?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- ‘ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్కు కలిసి వస్తుందా..?
- ‘ఆదర్శ కుటుంబం’ కోసం రాజుగారి ప్రయత్నం.. ఫలించేనా..?
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు అక్కడ రిలీజ్ కష్టాలు..!
- మరో భాషలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ‘మా ఇంటి బంగారం’
- సమీక్ష: హుషార్ పిట్టలు – కొన్ని సీన్స్ ఇబ్బంది పెట్టినా సందేశం బాగుంది

