
62వ ఫిలిం ఫేర్ అవార్డ్స్ సౌత్ వేడుక లో ఘనంగా జరిగిన విషయం తెలిసినదే. ఈ ఏడాది టాలీవుడ్ కి సంబంధించి మనం సినిమా అత్యధికంగా 5 అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ డైరెక్టర్ మొదలగునవి ఈ లిస్టులో వున్నాయి..
ఈ వేడుక పూర్తవగానే చిత్రాన్ని విజయవంతం చేసిన తెలుగు ప్రేక్షకులకు నాగార్జున ధన్యవాదాలు తెలిపాడు. దర్శకుడు విక్రమ్ కుమార్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ లతో కలిసి ఒక ఫోటో దిగి ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. నాగేశ్వరరావు గారి చివరి కానుకగా మనం మనందరికీ గుర్తుండిపోతుంది. వయసు పెరిమితి, క్లాసు పరిమితి లేకుండా అందరినీ ఈ చిత్రం ఆకర్షించింది.. ఆదారి చేతా ఈ చిత్రం ఆదరించబడింది.. #ANRLIVESON

