టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత తనకు సమయం దొరికినప్పుడల్లా తన పిల్లలతో ట్రావెల్ చేయడం, వారితో సమయం గడపడం చేస్తుంటారు. ఇక తాజాగా తన ఫ్యామిలీతో కలిసి నమ్రతా న్యూయార్క్లో వెకేషన్లో ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ జరిగే కొన్ని స్పెషల్ ఈవెంట్స్ అండ్ ప్లేసెస్ను ఆమె చూస్తున్నారు.
తాజాగా ప్రియాంక చోప్రా భర్త అయిన అమెరికన్ సింగర్ నిక్ జోనస్ నుంచి వచ్చిన లేటెస్ట్ మ్యూజికల్ షో ‘ది లాస్ట్ ఫైవ్ ఇయర్స్’ను నమ్రత తన పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి వీక్షించారు. ఇలాంటి షోను వీక్షించడం తనకు సంతోషంగా ఉందని.. నిక్ జోనస్ అద్భుతంగా పర్ఫార్మ్ చేశాడని నమ్రత ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఇక ఈ సందర్భంగా నిక్ జోనస్తో కలిసి ఓ ఫోటోను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.