యువ కథానాయకుడు అల్లు శిరీష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై రూపొందుతోన్న ఎంటర్టైనర్ ‘ఏబీసీడీ’. ‘అమెరిక్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి’ ట్యాగ్ లైన్. సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతోన్న ఈ సినిమాను మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మిస్తున్నారు. ఈ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాకు క్లీన్ `యు` సర్టిఫికేట్ వచ్చింది. సినిమాను మే 17న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.
కాగా సోమవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ను హైదరాబాద్లో నిర్వహించారు. నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ… ‘నాకు ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. శిరీష్ కు ఆల్ ది వెరీ బెస్ట్. తన కెరీర్కు సంబంధించి ఏబీసీడీలు ఎప్పుడో స్టార్ట్ చేసిన శిరీష్, తన స్టార్ డమ్ కు సంబంధించిన ఏబీసీడీలు ఈ సినిమాతో స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. దర్శకుడు సంజీవ్ కి ఆల్ ది వెరీ బెస్ట్. రుక్సర్ మంచి పెర్ఫామర్. తనకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అని అన్నారు.