శర్వానంద్ కై యంగ్ డైరెక్టర్ !

శర్వానంద్ కై యంగ్ డైరెక్టర్ !

Published on Oct 23, 2018 4:00 AM IST

నూతన దర్శకుడు ఆర్ ఎస్ నాయుడు దర్శకత్వంలో హీరో సుధీర్ బాబు, నాభ నటేష్ హీరో హీరోయిన్లుగా వచ్చిన ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో హిట్ కొట్టాడు ఆర్ ఎస్ నాయుడు. తొలి చిత్రం అయినప్పటికి దర్శకుడు ఆర్ ఎస్ నాయుడు సినిమాని చాలా చక్కగా తెరకేక్కించాడని మంచి పేరు తెచ్చుకున్నాడు. దాంతో ఇప్పుడు ఈ దర్శకుడుకి ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు వస్తున్నాయి.

కాగా ‘పడి పడి లేచే మనసు’ నిర్మాత సుధాకర్ తమ బ్యానర్ లో ఓ సినిమా చెయ్యమని ఆర్ ఎస్ నాయుడుకి అడ్వాన్స్ ఇచ్చారట. సుధాకర్ తో పాటు మరో ఇద్దరు ప్రొడ్యూసర్స్ కూడా నాయుడుతో సినిమా చెయ్యటానికి ఇంట్రస్ట్ చూపుతున్నారని తెలుస్తోంది. అయితే ఈ దర్శకుడు మాత్రం తన తర్వాత సినిమాని హీరో శర్వానంద్ తో చెయ్యాలని చూస్తున్నాడు. ఇప్పటికే శర్వాకి ఓ లైన్ కూడా వినిపించారట. ప్రస్తుతం మూడు సినిమాలకి కమిట్ అయిన శర్వానంద్, ఆర్ ఎస్ నాయుడుకి అవకాశం ఇస్తాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు