‘చిత్ర లహరి’ లోకి మరో హీరోయిన్ !

‘చిత్ర లహరి’ లోకి మరో హీరోయిన్ !

Published on Nov 5, 2018 12:17 PM IST

వరుస పరాజయాల తరువాత సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మరో చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఆయన ‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘చిత్ర లహరి’ అనే చిత్రంలో నటించనున్నాడు. ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంచ్ అయ్యింది.

ఇక ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లుకు ప్రాధాన్యం వుంది. ‘హలో’ ఫేమ్ కళ్యాణి ప్రియ దర్శిని ఈచిత్రానికి మొదటి హీరోయిన్ కాగా తాజాగా తమిళ నటి నివేత పేతురాజ్ ను మరో హీరోయిన్ గా ఫైనల్ చేశారు. ఈచిత్రంలో కళ్యాణి ‘చిత్ర’ పాత్రలో నటించనుండగా నివేత ‘లహరి’ పాత్రలలో నటించనుంది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈచిత్రంలో సునీల్ ముఖ్య పాత్రలో నటించనున్నాడు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు