‘ఒరేయ్ …బుజ్జిగా’ అంటున్న హెబ్బా !

‘ఒరేయ్ …బుజ్జిగా’ అంటున్న హెబ్బా !

Published on Nov 15, 2019 3:45 PM IST

ఏమైంది ఈ వేళ‌, అధినేత‌, బెంగాల్ టైగ‌ర్‌, పంతం వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌ను నిర్మించి రీసెంట్‌గా కార్తి ఖైదీ చిత్రాన్ని తెలుగులో స‌మ‌ర్పించి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ అందుకున్నారు శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధా మోహ‌న్. ప్ర‌స్తుతం రాజ్‌ త‌రుణ్‌, మాళ‌వికా నాయ‌ర్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ కె.కె. రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై గుండె జారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం వంటి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్స్‌ను అందించిన దర్శకుడు కొండా విజ‌య్‌కుమార్ తెరక్కిస్తున్న చిత్రం. ఒరేయ్ బుజ్జిగా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఇందులో ఓ కీలక పాత్ర‌లో కుమారి 21 ఎఫ్‌ ఫేమ్ హెబ్బా ప‌టేల్ న‌టిస్తున్నారు. తాజా షెడ్యూల్‌లో గురువారం నుండి హెబ్బా ప‌టేల్ యూనిట్‌తో జాయిన్ అయ్యారు. ఆమెపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా.. చిత్ర‌ నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ – మా బ్యాన‌ర్‌లో రూపొందుతోన్న ఒరేయ్ బుజ్జిగా షూటింగ్ అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం జ‌రుగుతుంది. రాజ్‌ త‌రుణ్ స‌ర‌స‌న మాళ‌వికా నాయ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా కీల‌క‌మైన పాత్ర‌లో కుమారి 21 ఎఫ్‌ చిత్రంతో యూత్‌కి ద‌గ్గ‌రైన హీరోయిన్ హెబ్బా ప‌టేల్ న‌టిస్తున్నారు. మాళ‌వికా, హెబ్బా ప‌టేల్ ఇద్ద‌రి పాత్ర‌ల‌కు ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ సంద‌ర్భంగా క‌థ న‌చ్చి సినిమా చేయ‌డానికి ఒప్పుకున్న హెబ్బాప‌టేల్‌కు థ్యాంక్స్‌. సినిమాను ఎంట‌ర్‌టైనింగ్‌గా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా ద‌ర్శ‌కుడు కొండా విజ‌య్‌కుమార్ తెర‌కెక్కిస్తున్నారు అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు