దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థకి “టిల్లు స్క్వేర్” హక్కులు

దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థకి “టిల్లు స్క్వేర్” హక్కులు

Published on Mar 28, 2024 1:07 PM IST

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించిన క్రేజీ సీక్వెల్ చిత్రం “టిల్లు స్క్వేర్”. మరి డీజే టిల్లు కి సీక్వెల్ గా చేసిన ఈ చిత్రం నుంచి నిన్ననే రిలీజ్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయగా దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు రేపు గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉండగా ఈ సినిమా ఓటిటి అప్డేట్ తెలుస్తుంది.

దీని ప్రకారం ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులని దిగ్గజ ఓటిటి యాప్ నెట్ ఫ్లిక్స్ వారు అయితే సొంతం చేసుకున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. మరి వారు సాలిడ్ ధరనే ఈ చిత్రానికి అందించినట్టుగా టాక్. మొత్తానికి అయితే థియేటర్స్ లో వచ్చాక ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో సందడి చేయనుంది. ఇక ఈ సినిమాలో మురళీ శర్మ, ప్రిన్స్ తదితరులు నటించగా రామ్ మిర్యాల, భీమ్స్ లు సంగీతం అందించారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు