నవంబర్ 22న ‘అల వైకుంఠపురములో’.. !

నవంబర్ 22న ‘అల వైకుంఠపురములో’.. !

Published on Nov 14, 2019 7:09 PM IST

‘అల వైకుంఠపురములో’ నుండి ఈ రోజు ఉదయం స్పెషల్ సర్ ప్రైజ్ గా మూడో సాంగ్ ‘ఓ మై గాడ్ డాడీ…’ సాంగ్ టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఈ సాంగ్ టీజర్ లో బన్నీ కుమారుడు అయాన్, కుమార్తె అహాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బన్నీ ఫోటోను చూస్తూ వాళ్ళు ఫన్నీగా తల బాదుకోవడం, అలాగే చివర్లో అయాన్ వేసిన స్టెప్ కూడా సాంగ్ టీజర్ కి హైలెట్ గా నిలిచింది. అయితే తాజాగా ‘ఓ మై గాడ్ డాడీ…’ ఫుల్ సాంగ్ ను నవంబర్ 22న విడుదల చేయబోతున్నట్లు.. అలాగే ఫుల్ సాంగ్ లో చాల సర్ ప్రైజ్ లు ఉండబోనున్నట్లు తమన్ ట్వీట్ చేశారు.

కాగా ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు ఫుల్ సాంగ్స్ విడుదలయి.. అవి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక బన్నీ – త్రివిక్రమ్ పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో రాబోతున్నారు.

ఇక ఈ సినిమలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే డీజే సినిమాలో బన్నీ సరసన నటించింది. అలాగే ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు