నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా రానుందని తెలిసిందే. దాంట్లో మొదటి భాగం ‘కథానాయకుడు’ షూటింగ్ దాదాపుగా పూర్తికావొచ్చింది. ఇక ఈచిత్రం యొక్క టీజర్ డిసెంబర్ 2న విడుదలకానుందని సమాచారం.
క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రానా , సుమంత్ , నరేష్ , కళ్యాణ్ రామ్ , నిత్య మీనన్ , మాళవిక నాయర్ , రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్బికె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ , విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 9న విడుదలకానుంది.