తిరుమల, సింహాచలంను దర్శించుకోనున్న ఎన్.టి.అర్

తిరుమల, సింహాచలంను దర్శించుకోనున్న ఎన్.టి.అర్

Published on Mar 10, 2013 1:26 AM IST

ntr-jr

యంగ్ టైగర్ ఎన్.టి.అర్ సినిమా ‘బాద్షా’ నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఈ సినిమాని మార్చి16 వరుకు పూర్తి చేయాలనుకుంటున్నారు. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నఈ సినిమాకి బండ్ల గణేష్ నిర్మాత. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. కొద్ది రోజులు ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరిగింది. శ్రీనువైట్ల కుమార్తెలపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం అందరి చూపు ఈ ఆడియో విడుదలపై వుంది. ఈ ఆడియోని మార్చి17న హైదరాబాద్ నానక్ రామ్ గూడాలో గల రామానాయుడు స్టూడియోలో విడుదల చేయనున్నారు. ఆ రోజు ఎన్.టి.అర్ తిరుమల, సింహాచలం దర్శించుకొని హైదరాబాద్ కు వస్తాడని నిర్మాత బండ్ల గణేష్ తెలియజేశాడు. మార్చి17న ఎన్.టి.అర్ తో పాటుగా బండ్ల గణేష్, శ్రీనువైట్ల కూడా స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లనున్నారు.

ఈ సినిమా ఆడియోని ఈ మార్చి10న విడుదల చేయాలనుకున్నారు సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల ఈ ఆడియోని మర్చి17న విడుదలచేస్తున్నారు. కోనా వెంకట్ – గోపీ మోహన్ లు స్క్రిప్ట్ అందించిన ఈ సినిమాకి శ్రీను వైట్ల డైలాగ్స్ రాశారు. ఈ సినిమాకి కె.వి.గుహన్ సినిమాటోగ్రఫీని అందించగా ఎస్.ఎస్.థమన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాను ఏప్రిల్ 5 విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు