
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్, వారి సూపర్ హిట్ చిత్రాల రీ రిలీజ్ ల ద్వారా పుట్టినరోజులను జరుపుకున్నారు. జల్సా, ఖుషీ, పోకిరి, ఆరెంజ్, మరియు ఇప్పుడు దేశముదురు రీ రిలీజ్ అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
ఎన్టీఆర్ మరియు ఎస్ఎస్ రాజమౌళి బ్లాక్ బస్టర్ సింహాద్రి మే 20 న రీ రిలీజ్ కానుంది. అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాను, తారక్ పుట్టినరోజుకి మళ్లీ విడుదల చేయడం గొప్ప నిర్ణయం. భూమిక, అంకిత కథానాయికలుగా నటించారు. ముఖేష్ రిషి, నాజర్, రాహుల్ దేవ్, బ్రహ్మానందం, శరత్ సక్సేనా ఇతర కీలక పాత్రలు పోషించారు. విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ చిత్రానికి వి.విజయ్ కుమార్ వర్మ నిర్మాత. ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చారు.