50 రోజులు పూర్తి చేసుకున్న నువ్విలా

50 రోజులు పూర్తి చేసుకున్న నువ్విలా

Published on Dec 22, 2011 11:38 AM IST


నూతన నటీ నటులతో రవిబాబు తీసిన చిత్రం ‘నువ్విలా’. ఈ చిత్రం మంచి విజయం సాధించి నేటితో 50 రోజులు పూర్తి చేసుకుంది. రవి బాబు గతంలో నూతన నటులతో ‘నచ్చావులే’ చిత్రం తీసి విజయం సాధించారు. ఆ చిత్రంలో తనీష్ మరియు మాధవీ లత లను తెలుగు తెరకు పరిచయం చేసారు. ఇక నువ్విలా విషయానికి వస్తే హవీష్, అజయ్, ప్రసాద్ బార్వి, విజయ్ సాయి, యామి గౌతమ్, సరయు, రమ్య కొత్త నటులను పరిచయం చేసారు. నూతన నటులను ప్రోత్సహించే రామోజీ రావు గారు ఈ చిత్ర నిర్మాత. నువ్విలా మరియు నచ్చావులే రెండు చిత్రాలకు ఆయనే నిర్మించడం విశేషం. నువ్విలా చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు