ఓ పిట్ట కథ’ స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది – నటుడు బ్రహ్మాజీ

ఓ పిట్ట కథ’ స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది – నటుడు బ్రహ్మాజీ

Published on Feb 28, 2020 3:30 PM IST

అగ్ర నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ పతాకంపై చెందు ముద్దుని దర్శకుడిగా పరిచయం చేస్తూ వి.ఆనందప్రసాద్‌ నిర్మిస్తున్న తాజా చిత్రం `ఓ పిట్ట కథ`. విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్రావు హీరోలుగా, నిత్యాశెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం చిత్రీక‌ర‌ణ పూర్త‌యి మార్చి 6న విడుదలకి సిద్ధంగా ఉంది.

ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో బ్రహ్మాజీ మాట్లాడుతూ.. “ఓ పిట్ట కథ మార్చ్ 6న విడుదల అవుతుంది. డైరెక్టర్ చెందు ముద్దు సినిమా చాల ముద్దుగా తీశారు. మా ఓ పిట్ట కథ వెనుక ఓ చిన్న పిట్ట కథ ఉంది, ఆయన మొదట ఒక కాన్సెప్ట్ తో మా దగ్గరికి వచ్చాడు. నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు డైరెక్టర్ ఫ్రెండ్స్ చెందు గురించి చాల బాగా చెప్పారు. ఒక రోజు ఆ కాన్సెప్ట్ మీద ఒక షార్ట్ ఫిలిం చేద్దాం అని అడిగారు, నాకు డేట్స్ కుదరక వద్దన్నాను. తరువాత అదే కథతో ఒక డెమో ఫిలిం చూపించారు, థ్రిల్లింగ్ గా అనిపించింది అదేకదా వినలేదు చూడలేదు. అదే సమయంలో భవ్య క్రియేషన్స్ అన్నే రవి ని కలవటం, ఆనంద్ ప్రసాద్ గారికి కూడా ఇది నచ్చడం జరిగిపోయాయి. అదే సమయంలో అక్కడే ఉన్న చంద్ర శేఖర్ యేలేటి గారికి కూడా దీని గురించి చెప్పడం ఆయన స్క్రీన్ ప్లే నచ్చడంతో దాన్ని డెవెలప్ చేసి సినిమాగా ఎలా తియ్యొచ్చు అన్నదానిపై డైరెక్టర్ కి సూచనిలిచ్చారు. అలాగే ఈ సినిమా కి ఇంత విలువ వచ్చింది అంటే అది భవ్య క్రియేషన్స్ వల్లే. మంచి కంటెంట్ ఉన్న ఇలాంటి సినిమాలకి సపోర్టింగ్ గా ఉంటున్న భవ్య వాళ్ళకి చాల ధన్యవాదములు. ఈ చిత్రాన్ని నన్ను నమ్మి త్రివిక్రమ్ గారు, రానా, హరీష్ శంకర్, మహేష్ బాబు గారు ముందునుండి చాలా సపోర్ట్ చేశారు. చిత్రానికి టాగ్ లైన్ త్రివిక్రమ్ గారే ఇచ్చారు, మహేష్ బాబు గారు అంత బిజీ షెడ్యూల్ లో కూడా మమ్మల్ని నమ్మి ప్రీ టీజర్ ని లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. చివరగా, ఈ సినిమా బాగుంటే పది మందికి చెప్పండి, బాలేదు అంటే వంద మందికి చెప్పండి. కథని డైరక్టర్ ని నమ్మిన భవ్య క్రియేషన్స్ గర్వం గా ఫీల్ అయి ఇంకా కొత్త వాళ్ళతో చేయటానికి ఈ చిత్రం ఒక మంచి ప్రోత్సాహం ఇస్తుందని నమ్ముతున్నా” అన్నారు.

ప్రొడ్యూసర్ ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ… “మా సినిమా మార్చి 6న విడుదలవుతుంది. ఉత్కంఠంగా సాగే సన్నివేశాలతో, అందమైన విజువల్స్ తో మా ‘ఓ పిట్ట కథ’ మీ అందరిని అలరిస్తుంది. డైరక్టర్ చెందు ముద్దు చాలా బాగా తీశారు. నటీ నటులు, బ్రహ్మాజీ, సంజయ్, విశ్వంత్, నిత్యా చాలా బాగా చేశారు. చిత్రానికి సంబంధించిన లుక్స్ కి ప్రీ టీజర్ కి అనూహ్య స్పందన లభించడం ఆనందంగా ఉంది. వినోదం, ప్రేమ, సస్పెన్స్ తో మంచి కంటెంట్ ఉన్న చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం” అన్నారు.

డైరెక్టర్ చెందు ముద్దు మాట్లాడుతూ.. “మా సినిమా కి సెన్సార్ వాళ్ళు క్లీన్ యూ ఇచ్చారు. ముందుగా బ్రహ్మాజీ గారికి, నిర్మాత ఆనంద్ ప్రసాద్ గారికి, అన్నే రవి గారికి ధన్యవాదాలు. డైరెక్టర్ ఏలేటి గారు మాకు చాలా సపోర్ట్ చేసారు. మా హీరోయిన్ వెంటక లక్ష్మి పాత్ర లో నిత్యా అనుకున్న దానికంటే బాగా చేసింది. విశ్వంత్ మా సినిమాకి మంచి అసెట్. సంజయ్, నేను ఎప్పటినుండో ట్రావెల్ చేస్తున్నాం, ఆయన టాలెంట్ నాకు బాగా తెలుసు. కామెరాన్ సునీల్ కుమార్ చాల చిన్న యూనిట్ తో చాలా ఎక్కువ పని చేశారు, అనుకున్నదానికంటే బాగా వచ్చాయి విజువల్స్. మా పిట్టా కథ మీ అందరికి బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను, మర్చి 6 న థియేటర్లలో కలుద్దాం” అన్నారు.

హీరో సంజయ్ మాట్లాడుతూ… “మా లాంటి కొత్త వాళ్ళని ఎందుకో త్వరగా ఎవరు నమ్మరు. కానీ నిర్మాత ఆనంద ప్రసాద్ గారు, అన్నే రవి గారు మమ్మల్ని నమ్మి ఈ చిత్రంపై ఇన్వెస్ట్ చేసారు. నేను విశ్వంత్, నిత్యా చాల ఎంజాయ్ చేస్తూ నటించాం. సీనియర్లు మాకు బాగా గైడ్ చేసారు. చెందు గారికి మాతో ఎపుడు ఎలా ఉండాలో అన్ని బాగా తెలుసు. సినిమా చేస్తున్నపుడు మేమెంత ఎంజాయ్ చేసామో చేసేటపుడు మీరు అంతకు మించి ఆనందిస్తారని ఆశిస్తున్నా” అన్నారు.

హీరోయిన్ నిత్యా మాట్లాడుతూ.. ” ఓ పిట్ట కథ లాంటి మంచి కథ భవ్య క్రియేషన్స్ లాంటి ఒక మంచి బ్యానర్ మీద దొరకడం నా కెరీర్కి టర్నింగ్ పాయింటే. డైరెక్టర్ చెందు ముద్దు చెప్పింది చెప్పినట్టు తీశారు. కామెడీ ట్రాక్ కానీ, సస్పెన్స్ ట్రాక్ కానీ ఏది బోరింగ్ అనిపించదు. నా పాత్ర వెంకట లక్ష్మి పక్కింటి అమ్మాయిలాగా ఉంటుంది. బ్రహ్మజీ గారితో కలిసి ఒక సీన్ లేకపోయినా ఆయన నటించిన చిత్రంలో భాగమవడం చాలా ఆనందంగా ఉంది” అన్నారు.

హీరో విశ్వంత్ మాట్లాడుతూ… “ఇది ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయి ఇప్పుడు పెద్దగా కనిపిస్తుంది అంటే మా బ్యానర్ మరియు బ్రహ్మజీ గారికి కృతజ్ఞత చెప్పాలి. బ్రహ్మజీ గారు అనుకున్నదే నేను అంటునాన్ను, ఈ సినిమా బాగుంటే పది మందికి చెప్పండి, బాలేదు అంటే వంద మందికి చెప్పండి, మేము సినిమా రెడీ అవగానే చూసి చెప్తున్నం ఇది. చిత్రీకరణని 30 రోజులో పూర్తి చేసారు అంటే మా డి.ఓ.పి సునీల్ & డైరెక్టర్ చెందు కి వున్నా సింక్ మరియు టాలెంట్ కారణం. మంచి చిత్రాన్ని ప్రేక్షకులకి అందిస్తున్నామన్న నమ్మకం మా అందరికి ఉంది” అన్నారు.

నటీనటులు: విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ, బాలరాజు, శ్రీనివాస్‌ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి.
సాంకేతిక నిపుణులు: పాటలు: శ్రీజో , ఆర్ట్: వివేక్‌ అన్నామలై, ఎడిటర్‌: డి.వెంకటప్రభు, కెమెరా: సునీల్‌ కుమార్‌ యన్‌., సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అన్నే రవి, నిర్మాత: వి.ఆనంద ప్రసాద్‌. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం : చెందుముద్దు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు