లేటెస్ట్ గా బాలీవుడ్ సినిమాకి మన తెలుగు సినిమా మేకర్స్ అందించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రమే “జాట్”. బాలీవుడ్ బాలయ్య సన్నీ డియోల్ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కించిన ఈ చిత్రం సన్నీకి మంచి హిట్ గా నిలిచి సాలిడ్ రన్ తో దూసుకెళ్తుంది. ఇలా 100 కోట్ల మార్క్ దిశగా ఈ సినిమా వెళుతుండగా మేకర్స్ ఓ బిగ్ అనౌన్సమెంట్ ని సర్ప్రైజింగ్ గా అందించారు.
మరి దీనితో ఈ సినిమాకి సీక్వెల్ గా జాట్ 2 కూడా ఉంటుంది అని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. దీనితో ఈ సాలిడ్ అనౌన్సమెంట్ పట్ల అభిమానులు ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు. మరి సన్నీ డియోల్ నుంచి సీక్వెల్ అంటే దానికి భారీ మార్కెట్ ఉంది. జాట్ ఇంకొంచెం గట్టి ప్రమోషన్స్ చేసి ఉంటే ఇంకా పెద్ద సక్సెస్ ని అందుకొని ఉండేది కానీ ఇపుడు సీక్వెల్ అనౌన్స్ చేయడంతో దీనికి మాత్రం గట్టి రెస్పాన్స్ ఉండొచ్చని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
#JAAT is not resting after the blockbuster at the box office ????
He is on to a new mission. This time, the MASS FEAST will be bigger, bolder, and wilder ????#JAAT2 ❤????
Starring Action Superstar @iamsunnydeol
Directed by @megopichand
Produced by @MythriOfficial &… pic.twitter.com/Cp5RMrgXuR— Mythri Movie Makers (@MythriOfficial) April 17, 2025