‘ఓ బేబీ’ లేటెస్ట్ నైజాం కలెక్షన్స్ !

‘ఓ బేబీ’ లేటెస్ట్ నైజాం కలెక్షన్స్ !

Published on Jul 7, 2019 2:39 PM IST

నందినిరెడ్డి దర్శకత్వంలో సమంత అక్కినేని ప్రధాన పాత్రలో రిలీజ్ అయిన ‘ఓ బేబీ’ చిత్రం మార్నింగ్ షో నుండే మంచి పాజిటివ్ టాక్ తో అంచనాలను అందుకొని ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. మొత్తానికి నైజాంలో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ను రాబడుతూ ఓవరాల్ గా ఈ సినిమా సూపర్ హిట్ అనిపించుకుంది.

కాగా, మొదటి రోజు ‘ఓ బేబీ’ నైజాంలో ప్రీమియర్ షోలను కూడా కలుపుకుని మొత్తం రూ .60 లక్షల షేర్ ను రాబట్టింది. ఆలాగే శనివారం నాడు ఏకంగా ఈ చిత్రం 75 లక్షల షేర్ ను సాధించడం విశేషం. నైజాంలో మొత్తం రెండు రోజులుకుగానూ ‘ఓ బేబీ’ 1.35 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇంకా నైజాంలో ఈ చిత్రానికి ఆదరణ బాగానే ఉంది. మొదటి వారాంతపు కలెక్షన్లు మొత్తానికి భారీగా ఉండేలా ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు