సెన్సార్ పూర్తి చేసుకున్న ఓం భీమ్ బుష్…రన్ టైమ్ ఫిక్స్!

సెన్సార్ పూర్తి చేసుకున్న ఓం భీమ్ బుష్…రన్ టైమ్ ఫిక్స్!

Published on Mar 19, 2024 3:07 PM IST


యంగ్ హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ శ్రీ హర్ష కోనుగంటి దర్శకత్వం లో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్(Om Bheem bush). మార్చి 22, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకూ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజైన ట్రైలర్ సినిమా పై మరింత ఆసక్తిని రేకెత్తించింది.

తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు చిత్రానికి యూ/ఎ సర్టిఫికెట్ ను ఇవ్వడం జరిగింది. ఈ చిత్రం 2 గంటల 15 నిమిషాల నిడివితో ఉంది. సన్నీ MR సంగీతం అందించిన ఈ చిత్రం లో ప్రియా వడ్లమని, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి లు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు