దసరా సందర్భంగా రేపు ఎన్టీఆర్ బయోపిక్ నుండి మరొక సప్రైజ్ !

దసరా సందర్భంగా రేపు ఎన్టీఆర్ బయోపిక్ నుండి మరొక సప్రైజ్ !

Published on Oct 17, 2018 6:56 PM IST


రేపు దసరా పండగ సందర్భంగా ఎన్టీఆర్ బయోపిక్ నుండి సప్రైజ్ ఇవ్వనున్నారు. రేపు సాయంత్రం 4:12 గంటలకు ఈ సప్రైజ్ ను రివీల్ చేయనున్నారు. బహుశా దివంగత హరికృష్ణ గెటప్ తో వున్న కళ్యాణ్ రామ్ లుక్ ను కానీ లేదంటే విద్యాబాలన్ లుక్ ను కానీ విడుదల చేసే అవకాశం వుంది.

క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో సావిత్రి పాత్రలో నిత్య మీనన్ నటిస్తుండగా అందాలనటి శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. ఇక చిత్రం రెండు భాగాలుగా రానుంది. దాంట్లో మొదటి భాగం ‘కథానాయకుడు’ అనే టైటిల్ తో వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. ఈచిత్రాన్నిఎన్బికె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ , విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు