‘పడి పడి లేచె మనసు’ షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది !

‘పడి పడి లేచె మనసు’ షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది !

Published on Oct 22, 2018 10:20 PM IST

హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా రాబోతున్న చిత్రం ‘పడి పడి లేచె మనసు’. ఈ చిత్రం షూటింగ్ ని పూర్తీ చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందం మొత్తం కలిసి ఒక గ్రూప్ ఫోటో కూడా దిగారు. ఇక ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ నెటిజన్లును బాగానే ఆకట్టుకుంటుంది. టీజర్ ప్రధానంగా హీరో హీరోయిన్ల మీద రొమాంటిక్ ఫీల్ తో సాగింది. శర్వానంద్ కూడా కొత్త లుక్ తో కనిపించాడు.

ఇక ఈ చిత్రంలో శర్వా ఫుట్ బాల్ ప్లేయర్ గా నటిస్తుండగా సాయి పల్లవి డాక్టర్ గా కనిపించనుంది. ముఖ్యంగా శర్వానంద్, సాయి పల్లవి మధ్య లవ్ ట్రాక్, వారి పాత్రల మధ్య సాగే కొన్ని సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయట. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని చెరుకూరి సుధాకర్ , చుక్కపల్లి ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు