మెగా హీరోల మీద గోపిచంద్ ‘పంతం’ నిలబడుతుందా ?

మెగా హీరోల మీద గోపిచంద్ ‘పంతం’ నిలబడుతుందా ?

Published on Jun 23, 2018 12:00 AM IST


యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా, కొత్త దర్శకుడు చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘పంతం’. రీసెంట్ గా ఈ చిత్రం అడియో ఫంక్షన్ ను గ్రాండ్ గా జరుపుకుంది. కాగా గత కొంతకాలంగా హీరో గోపిచంద్ వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. ఇప్పుడు పంతం చిత్రం మీదే గోపిచంద్ ఆశలన్నీ. అయితే పంతం చిత్రం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పంతం టీమ్ తమ చిత్రాన్ని జూలై 5న విడుదల చేస్తామని చెబుతూనే ఉంది. తమ చిత్రానికి ఎలాంటి పోటీ లేకుండా ప్లాన్ చేద్దామనుకున్న పంతం చిత్రబృందానికి షాక్ ఇస్తూ మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, కళ్యాణ్ దేవ్ గోపీచంద్ పంతానికి పోటీగా తమ చిత్రాలైన తేజ్ ఐ లవ్ యూ, విజేత చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు.

మరి ఈ మూడు చిత్రాల్లో ఏ చిత్రం విజయం సాధిస్తుందో అని సినీ అభిమానులు కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. విశేషం ఏమిటంటే పోటీపడబోతున్న ఈ ముగ్గురు హీరోల కెరీర్ కి ఈ చిత్రాలు చాలా కీలకం కానున్నాయి. ఏ చిత్రం పరాజయమైన ఆ చిత్ర హీరో కెరీర్ వెనుకపడటం ఖాయం. మరి ఇంత టఫ్ ఫైట్ లో ఏ హీరో విజయం సాధిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు