రవితేజతో ‘సారోస్తారా’ అనబోతున్న పరుల్ యాదవ్?

రవితేజతో ‘సారోస్తారా’ అనబోతున్న పరుల్ యాదవ్?

Published on Apr 19, 2012 4:19 PM IST


మాస్ మహారాజ రవితేజ దర్శకుడు పరుశురాం డైరెక్షన్లో రానున్న సినిమాలో పరుల్ యాదవ్ హీరొయిన్ గా నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకి సారోస్తారా అనే టైటిల్ అనుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రవితేజ మరియు పరశురాం కాంబినేషన్లో ‘ఆంజనేయులు’ అనే సినిమా వచ్చింది. మళ్లీ మూడు సంవత్సరాల తరువాత వీరిద్దరు కలిసి చేయబోతున్న సినిమాకి మణిశర్మ సంగీతం అందించే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని అశ్విని దత్ నిర్మించనున్నారు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న దరువు షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతుండగా రవితేజ దేవుడు చేసిన మనుషులు షూటింగ్లో పాల్గొంటున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు