జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిన్న ఉత్తరాంధ్ర తుఫాన్ బాధితుల పరామర్శ కు వెళ్ళారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయం దగ్గర నుండి వైజాగ్ వరకూ రోడ్ ప్రయాణం చేశారు. అక్కడి పరిస్థితులను గమనించి, వీలైనటువంటి సహాయక చర్యలు చేపట్టారు. ఈరోజు అక్కడి రాజకీయ నాయకులను కలవనున్నారు
ఇందులో భాగంగా ఇక్కడ నిత్యావసర వస్తువులను భారీ ధరకు అమ్ముతున్నట్టు నాకు లెక్కలేనన్ని పిర్యాదులు వచ్చాయి. అటువంటి బ్లాక్ మార్కెట్ ని సత్వరమే అదుపుచెయ్యాలని ప్రభుత్వానికి నా విజ్ఞప్తి. ఇక్కడ పరిస్థితి సద్దుమనిగేవరకూ ఇక్కడి ప్రజలకు ఎటువంటి సహాయం చెయ్యడానికన్నా నేనూ, నా అభిమానులు ఎప్పుడూ సిద్ధమని పవన్ తెలిపారు


