జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సికింద్రాబాద్ లో గల యశోదా హాస్పిటల్ వద్ద భాదిత కుటుంబాలను పరామర్శించారు. గురువారం ఉదయం మెదక్ జిల్లాలో జరిగిన ఘోర రైలు – బస్సు ప్రమాదంలో 20 మంది చిన్నారులు మరణించడంతో పాటు పలువురు గాయపడ్డారు. గాయపడిన చిన్నారులకు యశోదా హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు.
ఈ హృదయ విషాదకర వార్త తెలియగానే పవన్ కళ్యాణ్ చలించిపోయారు. ఆ చిన్నారులను, వారి తల్లిదండ్రులను పరామర్శించడం కోసం పవన్ హాస్పిటల్ కు విచ్చేశారు. భాదిత కుటుంబాలకు పవన్ తన ప్రగాడ సానుభూతి తెలియజేశారు. గాయపడిన పిల్లల తల్లిదండ్రుల నుంచి వారి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. భవిష్యత్లో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
