తన పహిల్వాన్ లకు పవన్ సన్మానం..!

తన పహిల్వాన్ లకు పవన్ సన్మానం..!

Published on Feb 28, 2021 4:20 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న అన్ని ప్రాజెక్టు లలో మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది క్రిష్ జాగర్లమూడి తో ప్లాన్ చేసిన భారీ పీరియాడిక్ చిత్రమే అని చెప్పాలి. దీనికంటూ ఇప్పుడు సెపరేట్ క్రేజ్ ఉంది. అయితే ఈ భారీ ప్రాజెక్ట్ కు సంబంధించి షూట్ పై ఇటీవలే మంచి ఆసక్తికరమైన విషయాలే బయటకు వచ్చాయి. పవన్ ఒక భీకర పోరాట సన్నివేశంలో ఉన్నారని పలు ఫోటోలు బయటకొచ్చాయ్.

హైదరాబాద్ కు చెందిన పలువురు మల్ల యోధులతో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను క్రిష్ ప్లాన్ చేశారు. మరి ఈ షూట్ లో పాల్గొన్న తన పహిల్వాన్ లకు పవర్ స్టార్ తన జనసేన పార్టీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా ఆహ్వానించి అందరికీ సన్మానం చేశారు. తన సినిమా సెట్స్ నుంచి పార్టీ ఆఫీస్ కు వెళ్ళి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇక ఈ భారీ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టైటిల్ ను మేకర్స్ వచ్చే మార్చి 11న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు