మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా.. ప్రేక్షకులతో పాటు ఇటు అభిమానుల నుంచి కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద పెద్ది తన స్థిరమైన, ఆకట్టుకునే రన్ ను కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 366 కోట్లకు పైగా వసూలు చేసింది. నిజానికి కొంత ప్రతికూలతను ఎదుర్కొన్నప్పటికీ, పెద్ది తన రెండో వారంలో కూడా బలమైన ఊపును కొనసాగిస్తోంది. రెండో శనివారం టికెట్ అమ్మకాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి.
ఒక్క బుక్మైషోలోనే 155,000కు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. మొత్తానికి వచ్చే వారం కూడా పెద్దికి అనుకూలంగా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ సంస్థ రూ. 350 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించింది. వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ భారీ యాక్షన్ ఎమోషనల్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. మొత్తానికి పెద్ది మంచి విజయాన్ని అందుకుంది.


