రాజ్ తరుణ్, కొండా విజయ్ కుమార్ల సక్సెస్ఫుల్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం `పవర్ ప్లే`. శ్రీమతి పద్మ సమర్పణలో వనమాలి క్రియేషన్స్ ప్రై.లి పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా మహిదర్, దేవేష్ సంయుక్తంగా నిర్మించారు. మార్చి 5న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్తో మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో థ్యాంక్స్ మీట్ను ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో పవర్ ప్లే మూవీ సక్సెస్ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు.
దర్శకుడు విజయ్ కుమార్ కొండా మాట్లాడుతూ – “ పవర్ ప్లే ఫస్ట్ రోజు యావరేజ్ కలెక్షన్స్తో స్టార్ట్ అయింది. ఆ తర్వాత రోజు నుండి ఆడియన్స్ మౌత్ టాక్, మీడియా పాజిటీవ్ రివ్యూస్ వల్ల డీసెంట్ కలెక్షన్స్ సాధిస్తోంది. సినిమా చూసిన ప్రతి వ్యక్తి ఒక మంచి సినిమా అని చెబుతున్నారు. ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే ఫస్ట్ టైమ్ రాజ్ ఒక కొత్త జోనర్ ట్రై చేశాడు. పూర్ణ ఇంతకు ముందెన్నడు చేయని ఒక క్యారెక్టర్ చేసింది. పూజా, దనరాజ్, భూపాల్, మధు ఇలా ప్రతి ఒక్కరూ తాము ఇంతకు ముందెన్నడు చేయని క్యారెక్టర్స్ ట్రై చేశారు. నేను ఒక కొత్త జోనర్లో చేశాను. మేమందరం కలిసి కొత్తగా చేసిన మా సినిమాని ఆదిరించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మాకు సపోర్ట్ చేసిన మీడియా వారికి స్పెషల్ థ్యాంక్స్ “ అన్నారు.
హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ – “ లాక్డౌన్ తర్వాత వెంటనే మా ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ఒరేయ్ బుజ్జిగా.. మూవీ రిలీజైంది. అది కంప్లీట్ ఎంటర్టైనర్. తర్వాత వెంటనే మేం అందరం కలిసి డిఫరెంట్ గా ట్రై చేద్దాం , ఆడియన్స్ ని ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని ఇద్దాం అని ఈ సినిమా చేయడం జరిగింది. మా ఇన్ని నెలల కష్టానికి మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు నిజంగా హ్యాపీగా ఉంది. మా సినిమాని ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్యూ వెరీ మచ్. ఫస్ట్ డే కలెక్షన్స్ తక్కువ వచ్చినా ఆడియన్స్ మౌత్ టాక్, మీడియా పాజిటీవ్ రివ్యూస్ వల్ల మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. చూసిన వాళ్లందరూ బాగుంది అంటున్నారు. ఎవరైనా చూడకపోతే థియేటర్ కి వెళ్లి సినిమా చూడండి. రెండు గంటలపాటు మిమ్మల్ని కంప్లీట్ గా సీట్ ఎడ్జ్న కూర్చోబెడుతుంది“ అన్నారు