మెగాస్టార్ తో ‘సైరా’ తీసి మంచి పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్నారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. కాగా తాజాగా ఈ సినిమా ఉంటుందని… పైగా ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాత నిర్మించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా సురేందర్ రెడ్డి ఇప్పటికే ప్రభాస్ కోసం ఓ స్క్రిప్టు సిద్ధం చేస్తోన్నాడట. ఓ స్టైలిష్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండనుందని.. ముఖ్యంగా ప్రభాస్ కు సరిపడే స్టోరీతో ఈ సినిమా రాబోతుందని సమాచారం.
ప్రభాస్ ప్రస్తుతం దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వంలో జాన్(వర్కింగ్ టైటిల్) సినిమాలో నటిస్తున్నాడు. మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2020 చివర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.