3ఏళ్ళ విరామం తరువాత ప్రణిత సుభాష్ మరలా టాలీవుడ్లోకి అడుగుపెట్టడానికి రంగం సిద్ధమైంది. 2010లో ఆమె ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ మరియు ‘బావ’ చిత్రాలలో నటించింది. ఆ రెండూ బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం పాలవ్వడంతో ప్రణిత కన్నడ సినీరంగానికి వెళ్ళిపోయి ఈ రెండేళ్లలో అక్కడ పలు చిత్రాలలో నటించింది. కార్తి సరసన తమిళ్ లో నటించిన ‘శకుని’ సినిమా తనకి చివరి పెద్ద చిత్రం. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా కొట్టింది.
ఈ ఏడాది ఆమెను అదృష్టం వరించి త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సరసన ఒక ముఖ్యమైన పాత్ర చేయ్యనుంది. ఒక ప్రముఖ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో “జీవితంలో ఒక్కసారే వచ్చే అవకాశాలో ఒకలాంటిదే పవన్ కళ్యాణ్ సరసన నటించడం కూడా, అది నేను కైవసం చేసుకున్నా. అతను పక్కన ఉంటే స్క్రీన్ పై ఉండే ఇంటెన్సిటీయే వేరు. అతను ఒక అద్బుతమైన నటుడని” చెప్పింది. తన పునరాగమనంపై తానూ చాల సంతోషంగా ఉండటంలో ఆశ్చర్యం లేదు. పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత సుభాష్ నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతుంది. ఈ చిత్ర బృందం త్వరలో స్పెయిన్ వెళ్లనుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.