“సలార్” పై ఆసక్తిగా మారిన పృథ్వీ భార్య సాలిడ్ పోస్ట్.!

“సలార్” పై ఆసక్తిగా మారిన పృథ్వీ భార్య సాలిడ్ పోస్ట్.!

Published on Nov 19, 2022 8:26 PM IST

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్”. నీల్ తన భారీ యాక్షన్ ఫ్లిక్ కేజీయఫ్ సినిమాల కన్నా ఎన్నో రేట్లు యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాని ప్లాన్ చేస్తుండగా దీనిపై తారా స్థాయి హైప్ నెలకొంది.

అలాగే ఇప్పుడు ఓ భారీ యాక్షన్ షెడ్యూల్ చేస్తుండగా తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్ర చేస్తున్న నటుడు పృథ్వీ రాజ్ భార్య సుప్రియ మీనన్ పృథ్వీ రాజ్ పెట్టిన పోస్ట్ ఆసక్తిగా మారి ప్రభాస్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. మరి ఆమె పెట్టిన పోస్ట్ లో అయితే తనకి ఇండియన్ సినిమా దగ్గర ఒక మోస్ట్ క్రియేటివ్ సినిమా వర్క్ సలార్ షూటింగ్ చూసే అవకాశం దక్కింది అని..

దర్శకుడు ప్రశాంత్ నీల్ గారి టేకింగ్ చూస్తూ ఉంటే ఈ చిత్రం అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసేలా కనిపిస్తుంది అని తెలిపింది. దీనితో ఈ సాలిడ్ పోస్ట్ ఒక్కసారిగా వైరల్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. అలాగే దీనిబట్టి సినిమా అవుట్ పుట్ కూడా ఏ రేంజ్ లో వస్తుందో అనేది మనం కూడా అర్ధం చేసుకోవచ్చు.

https://www.instagram.com/p/ClItLVzOV7x/?utm_source=ig_web_copy_link

సంబంధిత సమాచారం

తాజా వార్తలు