తమ ప్రత్యేకమైన ఫోటోలను భారీ మొత్తానికి అమ్మిన క్రేజీ కపుల్ !

తమ ప్రత్యేకమైన ఫోటోలను భారీ మొత్తానికి అమ్మిన క్రేజీ కపుల్ !

Published on Nov 12, 2018 11:02 AM IST

సెలెబ్రిటీల ఫోటోలు అంటే ప్రేక్షకులకు బాగా ఆసక్తి ఉంటుంది. పైగా సెలెబ్రిటీల పర్సనల్ ఫోటోలు అంటే.. అభిమానులు ఇంకా ఎంతో ఆసక్తి చూపుతారు. అందుకే సెలెబ్రిటీల పర్సనల్ ఫోటోలు అంటే.. మార్కెట్లో కూడా విపరీతమైన డిమాండ్ ఉంటుంది.

కాగా ప్రియాంక, నికి జోనస్ లు వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. జోధ్ పూర్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరగనుంది. ఈ వివాహానికి అతిరధ మహారధులు దాదాపు 300 మంది వరకు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. దాంతో వీరి వివాహ ఫోటోలకు బాగా డిమాండ్ ఏర్పడింది. దాంతో ఈ జంట ఆ డిమాండ్ ని క్యాష్ చేసుకోబోతున్నది.

వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రముఖ సంస్థకు వీరి వివాహ ఫోటోల రైట్స్ ను దాదాపు 2.5 మిలియన్ డాలర్లకు అమ్మేసినట్టుగా తెలుస్తోంది. అంత భారీ మొత్తం కట్టిన ఆ సంస్థ ఫోటోలు లీక్ అవ్వకుండా ఇప్పటినుంచే తగిన జాగ్రతలు తీసుకుంటుందట. అయితే ప్రియాంక, నికి జోనస్ లు తమ వివాహానికి వచ్చిన ఆ డబ్బును ఓ చారిటి సంస్థ కోసం వినియోగించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు