హీరోయిన్ త్రిషకు ఓపెన్ వార్నింగ్

హీరోయిన్ త్రిషకు ఓపెన్ వార్నింగ్

Published on Feb 23, 2020 6:37 PM IST

హీరోయిన్ త్రిష ’96’ సినిమాతో మరోసారి బౌన్స్ బ్యాక్ అయిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో ఆమెకు మరోసారి ఆఫర్లు మొదలయ్యాయి. ఆమె తాజాగా చేసిన చిత్రం ‘పరమపాదం విలైయాట్టు’. అన్ని పనులు పూర్తి చేసుకుని సినిమా ఈ నెల 28న విడుదలకానుంది. ఈ సందర్బంగా నిన్న శనివారం నిర్మాత సురేశ్ కామాక్షి ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు దర్శక నిర్మాతలు, ఇంకొంతమంది ముఖ్య అతిధులు హాజరయ్యారు.

కానీ అనూహ్యంగా కథానాయిక త్రిష మాత్రం వేడుకకు రాలేదు. దీంతో నిర్మాత తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. నమ్మి సినిమా చేసిన కథానాయికలు ప్రమోషన్లకు రాకపోవడం సమంజసం కాదని.. రజనీ, కమల్, విజయ్ లాంటి పెద్ద హీరోలే ప్రమోషన్లకు హాజరవుతుంటే హీరోయిన్లు ఎందుకు రావడం లేదో తెలియట్లేదని అన్నారు. ఇక నిర్మాతల మండలి నిర్వాహకుడు శివ మాట్లాడుతూ విడుదలలోపు త్రిష ప్రచారానికి రావాలని లేకుంటే పారితోషకం సగం వెనక్కి ఇవ్వాలని నిర్మాతల సంఘం తరపున హెచ్చరిక చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు