‘రామాయణ’లో మహేష్.. నిజం ఏంటో తేలేది అప్పుడే

‘రామాయణ’లో మహేష్.. నిజం ఏంటో తేలేది అప్పుడే

Published on Jun 30, 2021 9:49 PM IST

గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రాలు కలిసి ‘రామాయణ’ అనే ప్రాజెక్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం సుమారు రూ.600 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్టు నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రాన్ని దర్శకులు నితీశ్ తివారీ, రవి ఉద్యవార్ తెరకెక్కించనున్నారు. రామాయణ గాథను భారతీయులు ఊహించనంత గొప్పగా తెర మీద ఆవిష్కరించడమే ధ్యేయంగా ఈ సినిమాను రొపొందిస్తున్నామని నిర్మాతలు అన్నారు. అప్పట్లో ఇందులో రాముడిగా మహేష్ బాబు, రావణుడిగా హృతిక్ రోషన్, సీత పాత్రలో దీపికా పదుకొనే నటిస్తారని వార్తలు హడావుడి చేశాయి.

తాజాగా నిర్మాత మధు మంతెన ఈ విషయం మీద స్పందిస్తూ మహేష్, హృతిక్ రోషన్ ఇందులో నటిస్తారా అనే ప్రశ్నకు అవునని కానీ లేదని కానీ సమాధానం ఇవ్వకుండా చిన్న స్మైల్ ఇచ్చి సరిపెట్టారు. ఈ ఏడాది దీపావళి తర్వాత నటీనటులు ఎవరనేది ప్రకటిస్తామని అన్నారు. అంతేకాదు ఇందులో అన్ని విధాలా పరిపూర్ణమైన నటులే ఉంటారని, ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు చూడని కాస్టింగ్ ఈ సినిమాతో చూస్తారని అంటున్నారు. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా నుండి మాత్రమే కాదు దేశంలోని అన్ని వైపుల నుండి నటీనటులను తీసుకుంటామని చెప్పుకొచ్చారు. మరి వారు అనుకుంటున్న నటీనటుల్లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎంతమంది ఉంటారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు