మన దేశపు ఉన్నతి కోసం ఎంత తక్కువ చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది. అయితే మన దేశపు గౌరవం కోసం దేశం కోసం పాటుపడ్డ ఎంతో మంది మహోన్నత వ్యక్తుల కోసం కూడా భావితరాలకు చెప్పే భాద్యత కూడా మన మీద ఎంతో ఉంది. మరి అలా మన భారతదేశం కోసం చాటి చెప్పే కొన్ని అద్భుత ప్రయత్నాల్లో సినిమా కూడా ఒకటి. మరి అలాంటి వాటిలో మన దేశ గర్వించదగ్గ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కూడా ఒకరు.
మరి జక్కన్న లేటెస్ట్ గా తెరకెక్కించిన భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో మన దేశపు స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ లుగా చూపించి మన దేశపు అందులోని మన తెలుగు నేల రియల్ హీరోలను ప్రపంచ స్థాయిలో పరిచయం చేసి మరింత గర్వకారణంగా తీసుకొచ్చారు.
మరి లేటెస్ట్ గా అయితే మరో ప్రౌడ్ మూమెంట్ చిత్ర యూనిట్ కి మరియు మన దేశానికీ కూడా గర్వించదగ్గ ఘటన చోటు చేసుకుంది. తాజాగా ఈ చిత్రం జపాన్ దేశంలో రిలీజ్ కాగా అక్కడ మన దేశపు వందేమాతరం జెండా తో జపాన్ దేశస్థులు సినిమా సహా మన దేశం పట్ల ఉన్న గౌరవాన్ని వ్యక్త పరిచారు. దీనితో RRR యూనిట్ వారు మరింత గర్వం వ్యక్తం చేస్తున్నారు. ఇలా సినిమాతో మన దేశపు గౌరవాన్ని చాటి చెప్పినందుకు మాత్రం దర్శకుడు రాజమౌళి కి హ్యాట్సాఫ్ చెప్పి తీరాలి.
Proud moment for us to see the VANDE MATARAM flag in the hands of the Japanese and their love towards INDIA at the screening of #RRR… ????????❤️
JAI HIND! pic.twitter.com/rLgwpMCDPj
— RRR Movie (@RRRMovie) October 22, 2022