
కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు తెలుగు ప్రేక్షకులను ఎన్నో మరపురాని చిత్రాలను అందించారు. నటుడిగానే కాకుండా ఫాదర్ గా కూడా మోహన్ బాబు ఎంతో గర్వంగా ఫీలవుతున్నారు. మోహన్ బాబు తనయురాలు మంచు లక్ష్మీ నటించిన ‘దొంగాట’ సినిమా ఆడియో నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో మోహన్ బాబు మాట్లాడుతూ ‘నాకు ఎప్పుడూ మంచు లక్ష్మీ ని సింగర్ గా చూడాలనే కోరిక ఉండేది. ఈ సినిమాతో ఆ కల నెరవేరడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఎంతో గర్వంగా గొప్పగా ఉంది. ముఖ్యంగా మంచు లక్ష్మీ వాయిస్ నాకు ఒక్కసారిగా అలనాటి ప్లే బ్యాక్ సింగర్ ఎల్.ఆర్ ఈశ్వరిని గుర్తు చేసిందని’ అన్నారు. దొంగాట సినిమాలో మంచు లక్ష్మీ నటిగానే, నిర్మాతగానే కాకుండా ఈ సినిమాలో ఓ పాట పాడింది. ఆ పాటకి యు ట్యూబ్ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తున్నాయి. అడవి శేష్ హీరోగా నటించిన ఈ సినిమాతో వంశీ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

