అక్కడ అప్పుడే “పుష్ప” డీల్స్ స్టార్ట్ అయ్యాయా?

అక్కడ అప్పుడే “పుష్ప” డీల్స్ స్టార్ట్ అయ్యాయా?

Published on Mar 4, 2021 11:01 AM IST

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. ఇప్పుడు అయితే శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్న ఈ చిత్రంపై లేటెస్ట్ టాక్ ఒకటి వినిపిస్తుంది. మరి దీని ప్రకారం అప్పుడే ఈ సినిమా బిజినెస్ స్టార్ట్ అయ్యినట్టు తెలుస్తుంది.

మరి అందులో భాగంగా ముందు ఓవర్సీస్ బిజినెస్ నుంచే మేకర్స్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే అక్కడ సాలిడ్ ఫిగర్ నే నిర్మాతలు కోట్ చేస్తున్నారని టాక్. మరి ఈ పాన్ ఇండియన్ చిత్రానికి అక్కడ ఎంత ధర పలుకుతుందో చూడాలి. ఇక ఈ భారీ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అవుట్ స్టాండింగ్ మ్యూజిక్ ఇస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఆగష్టు 13న భారీ ఎత్తున విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు