నాలుగు భాషల్లో ‘క్వీన్’ రెడీ అవుతుంది !

నాలుగు భాషల్లో ‘క్వీన్’ రెడీ అవుతుంది !

Published on Jul 18, 2018 5:00 PM IST

2014లో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘క్వీన్’. అక్కడ ఘాన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తాజాగా సౌత్ లో నాలుగు భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం అన్ని భాషల్లోఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవల పారిస్ షెడ్యూల్ ను ముగించుకొని ముంబై కు చేరుకుంది చిత్ర టీం. ఆ షెడ్యూల్ తో చిత్రీకరణ పూర్తిఅవుతుంది.

ఇక తెలుగులో తమన్నాప్రధాన పాత్రలో నటిస్తున్న ఈచిత్రం ‘దటీజ్ మహాలక్ష్మీ అనే టైటిల్ తో తెరకెక్కుతుంది. ‘అవె’ ఫెమ్ ప్రశాంత్ వర్మఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. తమిళ భాషలో ‘పారిస్ పారిస్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్ కథనాయికగా నటిస్తుంది. అలాగే కన్నడలో ‘బట్టర్ ఫ్లై’ గా రానున్న ఈ చిత్రంలో పరుల్ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తుంది. తమిళ , కన్నడ భాషల్లో రమేష్ అరవింద్ తెరకెక్కిస్తున్నారు. ఇక మళయాళం లో మంజిమ మోహన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘జాం జాం’ అనే టైటిల్ తో నీలకంఠ రెడ్డి తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు