రామోజీ ఫిలిం సిటీలో రచ్చ

రామోజీ ఫిలిం సిటీలో రచ్చ

Published on Dec 21, 2011 4:16 PM IST


మెగా పవర్ స్టార్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘రచ్చ’. ప్రస్తుతం ఈ చిత్రం రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక్కడే చిత్రంలోని ముఖ్య నటీ నటులతో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో అందాల భామ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. చిరంజీవి గారి ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ ‘వాన వాన వెల్లువాయే’ పాటను రీమిక్స్ చేసి ఈ చిత్రంలో. సంపత్ నంది దర్శకత్వం వహిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.పరాస్ జైన్ మరియు ఎన్.వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తుండగా ఆర్.బి చౌదరి సమర్పిస్తున్నారు. ఇటీవలే బ్యాంకాక్, చైనా, శ్రీలంకలో కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. రచ్చ శరవేగంగా పూర్తి చేసి మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు