కర్నూలులో రచ్చ 50 రోజుల వేడుక

కర్నూలులో రచ్చ 50 రోజుల వేడుక

Published on Apr 19, 2012 1:10 PM IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ‘రచ్చ’ చిత్రం ఇటీవలే విడుదలై భారీ ఓపెనింగ్ సాధించి సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. మే 24న ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ వేడుకను కర్నూలులో భారీగా నిర్వహించాలని చిత్ర నిర్మాత నిర్ణయించారు. మొదటగా రచ్చ ఆడియో కర్నూలులో చేయాలని భావించినప్పటికీ పలు కారణాల వాళ్ళ వాయిదా పడి హైదరాబాదులో చేయాల్సి వచ్చింది. ఆ లోటును 50 రోజుల వేడుకతో భర్తీ చేయనున్నారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన తమన్నా నటించింది. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఎన్.వి ప్రసాద్ మరియు పరాస్ జైన నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు